Farmers in Patooru, Kovur, expressed anger over paddy procurement delays, criticizing officials for rejecting grains based on moisture content.

కోవూరు రైతుల ఆగ్రహం – ధాన్యం కొనుగోలుపై నిరసన

కోవూరు మండలం పాటూరులో వ్యవసాయ శాఖ జేడీ సీ. సత్యవాణి సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయగా, రైతులు తమ సమస్యలను ఉద్ధేశించి తీవ్రంగా మాట్లాడారు. తేమశాతం పేరుతో ధాన్యాన్ని కొలవడం లేదని, ఇప్పటికీ కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు లక్ష్మీశెట్టి శీనయ్య మాట్లాడుతూ, మూడునెలల క్రితమే ఎమ్మెల్యేకు ఈ సమస్య గురించి చెప్పినప్పటికీ, ఇప్పటికీ ఎటువంటి చర్యలు…

Read More
Trainee DSP Shiva Priya led vehicle checks in Inamadugu, Kovur. Fines were issued for rule violations, and some vehicles were seized.

ఇనమడుగు సెంటర్లో ట్రైని డీఎస్పి వాహన తనిఖీలు

కోవూరు మండలంలోని ఇనమడుగు సెంటర్లో ట్రైని డీఎస్పి శివ ప్రియ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి అనుమతులేని వాహనాలను పరిశీలించారు. రూల్స్ పాటించని వాహనదారులపై చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఫైన్లు విధించారు. అనుమతుల్లేని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నవారికి చలాన్లు విధించారు. రాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు…

Read More
MLA Prasanthi Reddy praised the 2025-26 AP budget, highlighting CM Chandrababu’s focus on economic growth and welfare.

2025-26 బడ్జెట్‌పై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ 2025-26 బడ్జెట్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశంసించారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన ఈ బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి కీలకంగా మారుతుందని అన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. పేదల బలోపేతం, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేశారని, స్వర్ణాంధ్ర – విజన్ 2047ను సాధించేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అసమర్థత వల్ల ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని తిరిగి…

Read More
MLA Vemireddy Prasanthi Reddy launched a plantation drive in Buchireddypalem with Teju Developers, planting 600 trees.

బుచ్చిరెడ్డిపాలెంలో తేజు డెవలపర్స్ సహకారంతో మొక్కల నాటకం

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో తేజు డెవలపర్స్ సహకారంతో డివైడర్‌పై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సుప్రజా మురళి, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తొలుత విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఓ విద్యార్థి భరతనాట్యం ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, తేజు డెవలపర్స్ సహకారంతో 600 మొక్కలు నాటించామని, వీటి సంరక్షణ…

Read More
A speeding bus crashed into a petrol pump in Kovvur, narrowly avoiding a major disaster. All passengers are safe.

కోవూరు పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు

కోవూరు మండలం రామన్నపాలెం జాతీయ రహదారి వద్ద వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్తున్న నవయుగ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు రహదారి పక్కనే ఉన్న జయ ఫిల్లింగ్ స్టేషన్‌లోకి దూసుకెళ్లింది. పెట్రోల్ పంపును ఢీకొట్టినప్పటికీ, పెట్రోల్ లీక్ కాకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయం అందించారు. పోలీసుల వివరాల ప్రకారం, డ్రైవర్ అధిక వేగంతో ఉండటం, నిద్రమత్తు కారణంగా అదుపు…

Read More
Bank officials conducted loan interviews for BC, OBC beneficiaries under the corporation scheme in Kovvur.

కోవూరులో బీసీ, ఓబీసీ కార్పొరేషన్ లోన్ల ఇంటర్వ్యూలు

కోవూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో బీసీ, ఓబీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు బ్యాంకు లోన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీడీవో శ్రీహరి సమక్షంలో బ్యాంకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి, లబ్ధిదారుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, తమ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఎంపీడీవో శ్రీహరి మాట్లాడుతూ, లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, బ్యాంకులకు పంపించామని తెలిపారు. బ్యాంకులు లబ్ధిదారుల యూనిట్ విలువ, అవసరమైన లోన్ మొత్తం…

Read More
MLA Vemireddy Prashanthi Reddy discussed road margin vendors' issues in Kovvur and suggested solutions.

కోవూరులో రోడ్డు మార్జిన్ వ్యాపారుల సమస్యపై సమావేశం

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని చెన్నూరు రోడ్డులో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులను తొలగించడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ సుప్రజ, కౌన్సిలర్లతో కలిసి వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. చిరు వ్యాపారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా వ్యాపారం చేసుకునేలా వీలుచూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్థానిక కౌన్సిలర్లు, టీడీపీ నాయకులతో కలిసి వ్యాపారస్తుల సమస్యలను అర్థం చేసుకుని, వారికి సహాయపడేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు….

Read More