
గూడూరు సమీపం పంబలేరు వాగులో యువతి మృతదేహం కలకలం
తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని పంబలేరు వాగులో ఓ యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలు గూడూరు సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని అని సమాచారం. ఆమె ఒంటిపై కళాశాల యూనిఫాం ఉండటంతో పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. యువతి మరణానికి గల…