గంజాయిని వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలీసుల వాహన తనిఖీల్లో 5 కేజీల నిషేధిత ఎండు గంజాయి (విలువ రూ.1.25 లక్షలు) పట్టుబడింది. నిందితులు పఠాన్ అస్లాం ఖాన్, వేదుల ప్రదీప్ కుమార్ వైజాగ్ సమీపంలోని సీలేరు నుంచి గంజాయి తరలిస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేసి, వాహనం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీ.ఐ సర్వయ్య పోలీసు సిబ్బందిని అభినందించారు.