Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోవూరులో బీసీ, ఓబీసీ కార్పొరేషన్ లోన్ల ఇంటర్వ్యూలు

కోవూరులో బీసీ, ఓబీసీ కార్పొరేషన్ లోన్ల ఇంటర్వ్యూలు

-

Chat on WhatsApp

కోవూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో బీసీ, ఓబీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు బ్యాంకు లోన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీడీవో శ్రీహరి సమక్షంలో బ్యాంకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి, లబ్ధిదారుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, తమ పత్రాలను అధికారులకు సమర్పించారు.

ఎంపీడీవో శ్రీహరి మాట్లాడుతూ, లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, బ్యాంకులకు పంపించామని తెలిపారు. బ్యాంకులు లబ్ధిదారుల యూనిట్ విలువ, అవసరమైన లోన్ మొత్తం పరిశీలించనున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులతో సమర్పించాల్సిందిగా సూచించారు.

బ్యాంకు అధికారులు లబ్ధిదారుల సిబిల్ వెరిఫికేషన్, ట్రాక్ రికార్డులను పరిశీలించి, అర్హులైన వారిని తుది జాబితాలో చేర్చనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పది రోజులలో ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.

కోవూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించేందుకు ఆలస్యం చేయొద్దని ఎంపీడీవో శ్రీహరి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

AEE ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? APTRANSCO కీలక ప్రకటన

APTRANSCO: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీపై వస్తున్న ప్రచారాలకు ఏపీట్రాన్స్‌కో పూర్తి స్థాయిలో చెక్ పెట్టింది. నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేదని, పూర్తిగా అభ్యర్థుల...
- Advertisement -
Chat on WhatsApp