
కోటగిరిలో శ్రీరామ నవమి సందర్భంగా కుస్తీ పోటీలు
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కోటగిరి మీదిగల్లీ నాయకుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. స్థానిక యువత, క్రీడాభిమానులు ఈ కార్యక్రమానికి సన్నాహాలు చేశారు. ఈ పోటీల్లో స్థానిక ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన మల్లయోధులు పాల్గొన్నారు. వందల సంఖ్యలో వచ్చిన మల్లయోధులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు….