
వేములపల్లిలో నెమలి మాంసం కలకలం!
వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని ఎరుకలవాడలో నెమలి మాంసం విక్రయిస్తోన్నారంటూ తీవ్ర కలకలం రేగింది. గ్రామంలోని ఓ వ్యక్తి నెమలి మాంసాన్ని విక్రయిస్తున్నాడన్న సమాచారం ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులకు అందించాడు. ఆ వెంటనే వేములపల్లి పోలీసులు, ఆటవిశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనుమానాస్పదంగా ఉన్న మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, మాంసం విక్రయించిన వ్యక్తి అది నెమలి కాదు, నీటి కోడి అని చెప్పడంతో ఇది నిజంగా జాతీయ పక్షి…