
చిలకలూరిపేటలో లంచం తీసుకుంటూ ఎంఈఓ పట్టివేత!
చిలకలూరిపేటలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో అధికారుల అవినీతి సమాచారంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో అక్కడ సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు బయటపడ్డాయి. దాడుల సందర్భంగా ఎంఈఓ లక్ష్మీ రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అప్పటికే ఆమెపై కొన్ని ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. లంచం తీసుకున్న ఆధారాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం…