
వాడపల్లి చెక్ పోస్ట్లో ధాన్యం లారీలు పట్టివేత
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద శనివారం భారీగా అక్రమంగా రవాణా చేస్తున్న వరి ధాన్యం పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్న ఏడు లారీలు, 2200 ధాన్య బస్తాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ధాన్యాన్ని తెలంగాణలో ప్రభుత్వ బోనస్ను పొందేందుకు కేటుగాళ్లు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వేరే రాష్ట్ర ధాన్యాన్ని ఇక్కడ విక్రయించడం నిషేధంగా ఉండటంతో, ఈ…