
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ – 9 బైకులు స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుండి దొంగిలించిన 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. భద్రాచలం రోడ్లో వాహన తనిఖీల సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. సీఐ కరుణాకర్ వివరాల ప్రకారం, ఎస్సై యాయాతి రాజు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా, సరిపల్లి నరసింహారావు అనే వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా,…