
పలమనేరు మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో ముందంజ
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లా స్థాయిలో తొలి స్థానంలో, రీజనల్ స్థాయిలో రెండో స్థానంలో, రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. పన్నుల వసూళ్లలో ఈ ఘనత సాధించడంలో పాలకులు, అధికారులు, సిబ్బంది, ప్రజల భాగస్వామ్యం కీలకమని రమణారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు సమయానికి పన్నులు చెల్లించడం…