
కృష్ణా జిల్లాలో పోలీస్ ఫిజికల్ టెస్టులో విషాదం
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించిన పోలీస్ ఫిజికల్ టెస్టులో విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరుకు చెందిన 25 ఏళ్ల దారావత్తు చంద్రశేఖర్ 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. పరుగు పందెంలో పాల్గొన్న అనంతరం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించడంతో, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషాద ఘటనతో పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాక్కు గురయ్యారు….