నేడు కొడంగల్‌లో KTR పర్యటన – షెడ్యూల్ ఇదే!

BRS Working President KTR will visit Kodangal today, attending farmer meetings and party events. BRS Working President KTR will visit Kodangal today, attending farmer meetings and party events.

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) నేడు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అలాగే, స్థానిక రైతులతో మట్లాడి, వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

KTR షెడ్యూల్ ప్రకారం, ఉదయం 10:30 గంటలకు నార్సింగ్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 12:30 గంటలకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ ఇంట్లో భోజనం చేయనున్నారు. అనంతరం 1:40 గంటలకు కొడంగల్ తున్కిమెట్లలో బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట్, లగచర్ల, కోడైపల్లి, రోటిబండ తండా ప్రాంతాల్లోని రైతులను పరామర్శించనున్నారు. అక్కడి రైతుల సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తారు. రైతుల సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేయనున్నారు.

అంతేకాదు, మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి చౌరస్తాలో జరిగే రైతు మహా ధర్నాలో పాల్గొంటారు. రైతు సమస్యలు, న్యాయమైన డిమాండ్ల గురించి మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *