Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఇంజనీరింగ్ విద్యార్థినిపై మోసం – అత్యాచారం కేసు

ఇంజనీరింగ్ విద్యార్థినిపై మోసం – అత్యాచారం కేసు

-

Chat on WhatsApp

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) అనే వ్యక్తి ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడు. ఫంక్షన్ ఉందని ఇంటికి పిలిచి యువతిని అతి దారుణంగా మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినిని ఇంటికి ఆహ్వానించిన హుస్సేన్, ఇంటికి వెళ్ళేసరికి అతని స్నేహితులు షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25) అక్కడే ఉన్నారు. ఫంక్షన్ జరగకపోవడంతో విద్యార్థిని అనుమానించి నిలదీయగా, హుస్సేన్ వ్యక్తిగతంగా మాట్లాడాలని నమ్మించి బయటకు వెళ్లిపోయాడు.

ఆ సమయంలో హుస్సేన్, ప్రభుదాస్ ఇంటి బయట కాపలా ఉండగా, గాలి సైదా గదిలోకి వచ్చి యువతిని బలవంతం చేశాడు. హుస్సేన్‌తో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి అత్యాచారం చేశాడు. అనంతరం ముగ్గురు నిందితులు ఆమెను వేధించసాగారు.

తనపై జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించిన విద్యార్థిని వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుస్సేన్, ప్రభుదాస్, గాలి సైదా అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp