Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeCrime Newsమంగళగిరిలో గంజాయి రవాణా చేస్తూ ఇద్దరు అరెస్ట్

మంగళగిరిలో గంజాయి రవాణా చేస్తూ ఇద్దరు అరెస్ట్

-

Chat on WhatsApp

మంగళగిరి మండలం ఖాజా గ్రామానికి చెందిన గంజి బోయిన శశాంక్ అలియాస్ శశి, మంగళగిరి పట్టణానికి చెందిన పెరుగు అనిల్ కుమార్ అలియాస్ పెరుగు గంజాయి రవాణా కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు గత మూడు నాలుగు సంవత్సరాలుగా విశాఖపట్నం వెళ్లి అర్జున్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి మంగళగిరికి తీసుకువచ్చేవారని గుర్తించారు.

ఇవ్వాళ పెదకాకాని మండల ఎమ్మార్వో గారి ఆధ్వర్యంలో పెదకాకాని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. గంజాయిని చిన్న చిన్న పాలిథిన్ ప్యాకెట్లలో వేసి, ఖాజా, మంగళగిరి, కాకాని, ఉప్పలపాడు వంటి ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు వీరి వద్ద నుంచి గంజాయి ప్యాకెట్లు, కొంత మొత్తం నగదు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి ముఠాలో మరికొందరు వ్యక్తులు ఉన్న అవకాశముండటంతో దర్యాప్తు కొనసాగుతోంది. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ అరెస్టుతో మంగళగిరి, పెదకాకాని పరిసర గ్రామాల్లో గంజాయి విక్రయదారులపై భయాందోళనలు పెరిగాయి. యువతను డ్రగ్స్‌కు అలవాటు చేసే ముఠాలను పూర్తిగా అంతమొందించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రజలు గంజాయి అక్రమ రవాణా సమాచారం పోలీసులకు అందించాలని కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp