వైజాగ్ స్టేడియం నుంచి వైఎస్ఆర్ పేరుతొలగింపుపై వైసీపీ నిరసన

YSRCP leaders protested against the removal of YSR’s name from Vizag Cricket Stadium, demanding its reinstatement. YSRCP leaders protested against the removal of YSR’s name from Vizag Cricket Stadium, demanding its reinstatement.

విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంకు వైఎస్ఆర్‌ పేరు తొలగించడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్‌ జిల్లా పేరును వైఎస్ఆర్‌ కడప జిల్లాగా మార్చి, తాడిగడప మున్సిపాలిటీ, విశాఖ క్రికెట్‌ స్టేడియం నుంచి వైఎస్ఆర్‌ పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు విశాఖ మధురవాడ క్రికెట్‌ స్టేడియం వద్ద భారీగా నిరసన తెలిపారు. వైఎస్ఆర్‌ విగ్రహం వద్ద చేరుకుని నినాదాలు చేశారు. స్టేడియానికి మళ్లీ వైఎస్ఆర్‌ పేరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిగణించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ వివాదం నేపథ్యంలో మర్చి 24, 30 తేదీల్లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో కూడా నిరసనలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టేడియం వద్ద ఆందోళనలు జరుగుతుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

ఈ పరిణామంపై అధికార పక్షం స్పందించాల్సిన అవసరం ఉందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. కేవలం రాజకీయ ప్రేరేపిత నిర్ణయాల వల్లనే వైఎస్ఆర్‌ పేరును తొలగించారని ఆరోపించారు. విశాఖ ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, త్వరలోనే పెద్దఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నామని వైసీపీ నేతలు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *