తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు

కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి ఏం పీకాడని మేమూ అడగగలమని, కానీ తమకు సంస్కారం అడ్డు వస్తోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సూచించింది. కేటీఆర్, హరీశ్ రావు తమ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోవాలని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించింది. ఈ మేరకు ‘తెలంగాణ కాంగ్రెస్’ ఎక్స్ హ్యాండిల్ వేదికగా ట్వీట్ చేసింది. “అన్నీ మేమే చేస్తే నువ్వు ఏం పీకుతావ్ రేవంతూ⁉️” అని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది. దీనిని…

Read More

భారీ వరదల నేపథ్యంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటన

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు ఆయన నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈరోజు విజయవాడ, ఏపీలోని ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. బాధిత కుటుంబాలు, రైతులను పరామర్శిస్తారు. ఆ తర్వాత విజయవాడలో అధికారులతో సమావేశమవుతారు. నష్టం అంచనాపై అధికారులతో చర్చిస్తారు. రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. వరదలతో అతలాకుతలమవుతున్న ఖమ్మం…

Read More
అభయ సమయంలో అంబులెన్స్ సిబ్బంది మహిళపై లైంగిక వేధింపులు. రోగిని రోడ్డుపైనే విడిచిపెట్టి, ఆక్సిజన్ లేని కారణంగా మరణం.

ఉత్తరప్రదేశ్‌లో అంబులెన్స్ సిబ్బందిపై లైంగిక వేధింపులు

అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సిబ్బందే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఓవైపు అంబులెన్స్ వెనక సీట్లో రోగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. ముందుసీట్లో ఆ రోగి భార్యను వేధించారు. భర్త ఆరోగ్యంపై ఆందోళనతో ఉందనే జాలి కూడా లేకుండా మానవత్వం మరిచి ఈ దుర్మార్గానికి తలపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడి వేధింపులను అడ్డుకోవడంతో నడి రోడ్డుపైనే రోగిని దించేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఫోన్ చేసి భర్తను వేరే ఆసుపత్రికి తరలించుకునే ప్రయత్నం…

Read More
ఏపీలో పింఛన్ల పంపిణీకి 1.34లక్షల కొత్త ఫింగర్‌ప్రింట్ స్కానర్ల కొనుగోలు. సెక్యూరిటీ సవాల్లకు పరిష్కారం.

ఏపీలో పింఛన్ల పంపిణీలో కొత్త ఫింగర్‌ప్రింట్ స్కాన‌ర్లు

పింఛ‌న్ల పంపిణీలో కీల‌క మార్పు దిశ‌గా ఏపీలోని కూట‌మి స‌ర్కార్ అడుగులేస్తోంది. ఈ మేర‌కు తాజాగా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొంత‌కాలంగా సామాజిక పింఛ‌న్ల పంపిణీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌కలకు ఆస్కారం లేకుండా స‌రికొత్త ప‌ద్ద‌తితో ముందుకు వ‌స్తోంది.  దీనిలో భాగంగా ప్ర‌భుత్వం అత్యాధునిక ఎల్ ఆర్‌డీ (రిజిస్ట‌ర్డ్‌) ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికోసం రూ. 53కోట్ల‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌య శాఖకు కేటాయించింది. దీంతో ఏపీ స‌ర్వీసెస్ టెక్నాల‌జీ ద్వారా డివైజ్‌ల…

Read More
భారీ వర్షాలు, వరదలపై కేంద్ర బృందం ఏపీకి వచ్చి నష్టం అంచనాలు వేసేందుకు పర్యటించనుంది. 8 సభ్యుల బృందం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనుంది.

ముంపు ప్రాథమిక అంచనాలకు కేంద్ర బృందం ఏపీకి…

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నష్టం అంచనాలకు కేంద్ర బృందం ఏపీకి వస్తోంది. రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో ఈ రోజు (గురువారం) కేంద్ర బృందం(ఇంటర్ మినిస్టీరియల్ టీం)పర్యటించనుంది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి…

Read More
ఉక్రెయిన్ వివాదం ముగింపునకు కృషి చేసే ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని అమెరికా ప్రకటించింది. మోదీ-జెలెన్‌స్కీ భేటీపై స్పందన.

ఉక్రెయిన్ వివాదంపై అమెరికా స్పందన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్న ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల ప్రత్యేక హక్కులు, శాంతిని కోరుకుంటున్న అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అనుగుణంగా కృషి చేయాలని, అలాంటి పాత్ర పోషించే దేశాన్ని తాము కచ్చితంగా స్వాగతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ జాతీయ భద్రతా సమాచార…

Read More
సుప్రీంకోర్టు, వివాదాస్పద అధికారికి పదవి కట్టబెట్టాలని చూసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉత్తరాఖండ్ సీఎం ధామిపై సుప్రీం ఆగ్రహం

వివాదాస్పద అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని, సీఎం అంటే రాజు కాదని హితవు చెప్పింది. ఈమేరకు బుధవారం ఓ పిటిషన్ విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ కు చెందిన ఐఏఎఫ్ ఆఫీసర్ ఒకరికి రాజాజీ…

Read More