“₹3,000 దాటిన యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు? కేంద్రం ముందుకు తెచ్చిన కీలక ప్రతిపాదన!”
ఉచితంగా సాగుతున్న యూపీఐ సేవలకు త్వరలోనే గీతలు పడే అవకాశముంది.₹3వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోంది.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇప్పటి వరకు యూపీఐ సేవలను ఉచితంగా అందిస్తూ వచ్చిన ప్రభుత్వం,ఇప్పుడు బ్యాంకులకు భారం తగ్గించేందుకు ఓ కీలక ప్రతిపాదనపై చర్చిస్తోంది.₹3,000 దాటిన యూపీఐ ట్రాన్సాక్షన్కి స్వల్ప ఛార్జీ ఉండవచ్చు. చిన్న మొత్తాలపై ఛార్జీలు ఉండవు.ఈ ప్రతిపాదన అమలైతే, వినియోగదారులపై భారం పెరగడం ఖాయం.కాగా, దీనిపై ఇంకా ప్రభుత్వ…
