హర్యానాలోని ఫరీదాబాద్లో హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన నలుగురు కొడుకులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి దారితీసినట్లు తెలుస్తోంది.ఈరోజు ఉదయం ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఐదు మృతదేహాలు కనుగొనబడ్డాయి. ప్రాథమిక విచారణలో మృతులు బీహార్కు చెందిన దినసరి కూలీ మనోజ్ కుమార్ (35) మరియు అతని నలుగురు కొడుకులుగా గుర్తించారు. మనోజ్ కుమార్కు తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి మనోజ్ కుమార్ తన భార్యతో తీవ్రంగా గొడవపడినట్లు సమాచారం. ఈరోజు ఉదయం అతను తన నలుగురు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. ఆత్మహత్యకు ముందు, మనోజ్ కుమార్ తన పిల్లలకు చిప్స్, కూల్ డ్రింక్స్ కొనిచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తరువాత వారందరూ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సమస్యలు ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.








