Nellore Commissioner Surya Teja orders fines for waste dumping in open spaces, with strict monitoring through CCTV.

బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసిన వారిపై కఠిన చర్యలు

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయడాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే చెత్త ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు కమిషనర్ సోమవారం 20వ డివిజన్ పరిధిలోని హనుమాన్ జంక్షన్, స్నేహ నగర్, అక్షయ గార్డెన్, వనంతోపు ప్రాంతాల్లో పర్యటించారు. అపార్ట్మెంట్ల నుంచి ఖాళీ స్థలాల్లో…

Read More
Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy inspected the construction of a 50-bed Critical Care Unit.

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ పరిశీలన

నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 24 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని, అత్యాధునిక వైద్య సదుపాయాలతో దీన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ యూనిట్…

Read More
Peddi Prabhavati Charitable Trust distributed watches to hostel students in Kovvur on the occasion of Holi.

పెద్ది ప్రభావతి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు హోలీ కానుక

సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా, పెద్ది ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవూరు ఎస్.డబ్ల్యూ పరిధిలోని 7 వసతి గృహాల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులకు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని వాచీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రైనీ డీఎస్పీ శివప్రియ పాల్గొని, విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. ట్రైనీ డీఎస్పీ శివప్రియ మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని, ఈ దశలో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని సాధనలో…

Read More
Kovur YSRCP SC/ST Cell leaders warned against criticism of their leader in a press meet.

కోవూరులో ఎస్సీ ఎస్టీ సెల్ నేతల విలేకరుల సమావేశం

కోవూరు మండలంలోని వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సెల్ అల్ట్రాసిటీ మెంబర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ, వైసీపీ నేత వీరు చలపతిరావుపై అనవసర విమర్శలు చేస్తున్న ఎల్లాయపాలెం ఎంపీటీసీ గరికపాటి రాజా మాటలకు అదుపు పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు అభిమాన నాయకుడైన వీరి చలపతిరావుపై విమర్శలు చేయడం మంచిది కాదని, ఆయన స్థాయిని గమనించాలని సూచించారు. ఒక రౌడీ షీటర్ అయిన వ్యక్తి మా…

Read More
MLA Somireddy demanded a government review in the Assembly for tribals missing out on welfare due to Aadhaar issues.

గిరిజనుల ఆధార్ సమస్యపై అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే గళం

సంక్షేమ పథకాల కోసం అవసరమైన ఆధార్ కార్డుల సమస్యను గిరిజనుల అభ్యున్నతికి ప్రధాన అడ్డంకిగా గుర్తించి, అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గళమెత్తారు. ఆధార్ లేకపోవడంతో అర్హులైన గిరిజనులు పింఛన్లు, రేషన్, ఇతర పథకాల నుంచి దూరమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పైనాపురం పంచాయతీలోని చిన్న సంఘం కాలనీలో 88 మందికి ఆధార్ కార్డులు లేవు. అదేవిధంగా, 60 కుటుంబాలకు రేషన్ కార్డులు అందుబాటులో లేవు. 19 మంది అర్హత ఉన్నప్పటికీ పింఛన్…

Read More
The Bar Association urged the district SP to take action against Kodavaluru SI for allegedly threatening Advocate Chennayya.

అడ్వకేట్ చెన్నయ్యకు బెదిరింపులపై బార్ అసోసియేషన్ ఆగ్రహం

కొడవలూరు పోలీస్ స్టేషన్‌లో అడ్వకేట్ ఆత్మకూరు చెన్నయ్యకు జరిగిన అవమానకర ఘటనపై కోవూరు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ట్ పేషెంట్ అయిన తన క్లయింట్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో, ఎస్సై కోటిరెడ్డి అందరిముందు పెద్దగా అరుస్తూ తనను బెదిరించాడని చెన్నయ్య వాపోయారు. క్లయింట్‌ను కలవనివ్వకుండా, అవసరమైన సమాచారం ఇవ్వకుండా తనపై కేసు పెడతానని బెదిరించాడని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై కోవూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ…

Read More
The 2600 acres allotted to Reliance remain unused. MLA Somireddy Chandramohan Reddy questions the impact on farmers and demands proper utilization.

రిళయన్స్‌కు 2600 ఎకరాల అవసరమా? భూముల వినియోగంపై సందేహం!

ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద పవర్ ప్రాజెక్ట్ కోసం 2008లో రిలయన్స్ సంస్థకు 2600 ఎకరాల భూమి కేటాయించారు. కానీ, 16 ఏళ్లుగా ఆ భూములు ఖాళీగానే ఉన్నాయి. పరిశ్రమలు అభివృద్ధి చేయాలని రైతులు భూమి త్యాగం చేసినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్ చేపట్టలేదు. దీనిపై అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భూమిని పరిశ్రమలకు కేటాయించిన తర్వాత రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కావాలని ఇండస్ట్రీయల్ పాలసీలో స్పష్టంగా ఉంది. నాలుగేళ్లైనా…

Read More