‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంఘటన తెలిసిన విషయం. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది.
బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, రూ. 25 లక్షల సాయం అందిస్తామని అల్లు అర్జున్ ప్రకటించిన విషయం తెలిసిందే. బన్నీ కుటుంబానికి అండగా ఉంటానని మరియు ₹25 లక్షలు అందిస్తానని ప్రకటించారు.
అయితే, ఇప్పుడు కాంగ్రెస్ రెబల్ నేత బక్క జడ్సన్ స్పందిస్తూ… రేవతి కుటుంబానికి ₹25 లక్షల సాయం అందలేదని తెలిపారు. కేవలం ₹10 లక్షల సాయం మాత్రమే బాధిత కుటుంబానికి అందిందని ఆయన ఆరోపించారు.
ఇక, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.