Thursday, August 6, 2026
Chat on WhatsApp

-

Chat on WhatsApp

“వేధింపులపై ఫిర్యాదు చేసిన బాలికపై దాడి – భర్తతో కలసి భవనంపై నుంచి తోసిన మహిళ”


వేధింపుల బాధితురాలిగా న్యాయం కోరిన ఓ బాలికపై భయానకంగా దాడి జరిగింది. ఆ బాలిక చెప్పింది విన్న మహిళ, తన భర్తతో కలిసి ఆమెను రెండు అంతస్తుల భవనం పైనుంచి తోసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.ఒక యువ బాలిక ఆమెను ఓ వ్యక్తి పలుమార్లు వేధిస్తున్నాడని చెప్పింది. ఆ వ్యక్తి మరెవరో కాదు తన పొరుగింటి మహిళ భర్త అని చెప్పింది. బాలిక చెప్పిన విషయాన్ని మొదట ఆ మహిళ విశ్వసించలేదు. కానీ ఆ విషయంపై భర్తతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంతో ఉన్న మహిళ, ఆ బాలికపై కోపం పట్టించుకుంది. కానీ ఈ సంఘటన అక్కడితో ఆగలేదు. ఆమె తన భర్తతో కలిసి బాలికను వారి నివాసమైన రెండు అంతస్తుల భవనం పైనుంచి తోసేశారు. భవన పైనుంచి పడిన బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. కాలుకు ఫ్రాక్చర్, వెన్నెముకకు గాయాలు కాగా, తక్షణమే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, కానిస్టేబుల్ దంపతులపై Attempt to Murder, POCSO చట్టం, మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటన బాధితురాలే నిందితురాలిగా మలచబడే విధంగా సమాజం ఎలా స్పందిస్తున్నదో చూపిస్తున్న ఉదాహరణ. న్యాయం కోసం పెదవి విప్పిన ఓ బాలికకు ఈ విధంగా స్పందించడం అత్యంత బాధాకరం. బాధితురాలికి న్యాయం జరగాలని సామాజికవేత్తలు, మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp