Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeNational"ఆర్సీబీ విజయోత్సవం విషాదంలో ముగిసింది – బెంగళూరులో తొక్కిసలాట, 11 మంది మృతి"

“ఆర్సీబీ విజయోత్సవం విషాదంలో ముగిసింది – బెంగళూరులో తొక్కిసలాట, 11 మంది మృతి”

-

Chat on WhatsApp

బెంగళూరులో ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) విజయోత్సవం ఘోర విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియం వెలుపల ఏర్పడిన భారీ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడినట్టు సమాచారం.బుధవారం జరగబోయే వేడుకలను పోలీసులు వాయిదా వేసుకోవాలంటూ కోరినా, RCB యాజమాన్యం తిరస్కరించినట్టు సమాచారం. ఆటగాళ్లు, ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు త్వరలో బయలుదేరిపోతారని కారణంగా చూపుతూ వేడుకలను అదే రోజు నిర్వహించారు. ప్రవేశ ద్వారాల వద్ద తొక్కిసలాట ఏర్పడింది. ఈ ఘటనలో మహిళలు, యువకులు సహా 11 మంది మృతి చెందారు. బెంగళూరు పోలీసులు ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభించారు. ముందస్తు హెచ్చరికలున్నా వేడుకలు నిర్వహించడమే ప్రమాదానికి దారితీశిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంఘటనపై RCB యాజమాన్యం స్పందించే అవకాశముంది.ఈ విషాద ఘటన క్రికెట్ అభిమానుల హృదయాలను కలచివేస్తోంది. ఆనంద వేడుక విషాదంలోకి మారడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp