ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకృతి ప్రాముఖ్యతను వివరించారు. “ప్రకృతి అంటే ఏ ఒక్కరిది కాదు. అది మన అందరిదీ. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది,” అని పేర్కొన్నారు. ఈ సందేశాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా, ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) లో షేర్ చేస్తూ, పర్యావరణ పరిరక్షణపై అందరికీ చైతన్యం కలగాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు చొరవ తీసుకోవాలని కోరిన సీఎం, పచ్చదనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. “గాలి, నీరు, నేల ఇవన్నీ మన భవిష్యత్తు కొరకు సంరక్షించాల్సిన విలువైన వనరులు,” అని ఆయన పేర్కొన్నారు.
“ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదే – పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సందేశం”
-








