మంగళగిరి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్…ఇక వివరాల్లోకి వెళ్తే
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావు ఆటోలో పాలకొల్లుకు వచ్చారు.
ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనకు అండగా నిలిచారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్లో లోకేష్ స్వయంగా వెంకటేశ్వరరావును కలుసుకొని, ఇచ్చిన హామీ ప్రకారం ట్రై స్కూటీని అందజేశారు.
ALSO READ:సిట్ విచారణకు డుమ్మా కొట్టిన సుబ్బారెడ్డి
గత నెలలో పాలకొల్లులో మంత్రి నిమ్మల కార్యాలయాన్ని సందర్శించినప్పుడు, చంద్రబాబుతో ఫోటో దిగాలనే కోరికను వెంకటేశ్వరరావు వ్యక్తం చేశారు.

దాంతో, నిమ్మల రామానాయుడు ఆ కోరికను నెరవేర్చుతానని, అలాగే ట్రై సైకిల్ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, దివ్యాంగుడి ధైర్యసాహసాన్ని మెచ్చుకొని తన వ్యక్తిగత నిధులతో ట్రై స్కూటీ అందజేస్తానని మాట ఇచ్చారు.
నేడు ఆ మాటను నిలబెట్టి స్కూటీని స్వయంగా అందజేశారు.ట్రై స్కూటీ అందుకున్న వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.
