Tirupati Crime | విద్యార్థిని ఫిర్యాదుతో ర్యాపిడో డ్రైవర్‌పై పోక్సో కేసు

Tirupati police station where a minor student filed a POCSO case Tirupati police station where a minor student filed a POCSO case

Tirupati Crime News: తిరుపతిలో పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థిని ఫిర్యాదుతో ర్యాపిడో ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు అయింది. ఎస్వీ పాలిటెక్నిక్‌ విద్యార్థిని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ  మరో హాస్టల్‌కు మారే సమయంలో ర్యాపిడో(Rapido) ద్వారా ఆటో బుక్‌ చేసింది.

ఆ సమయంలో డ్రైవర్‌ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఫోన్‌ నంబర్‌ తీసుకున్న అతడు తరచూ ఆమెతో సంప్రదిస్తూ ఏమైనా కావాలంటే సాయం చేస్తానని చెప్పేవాడు.

ALSO READ:ఇండోనేషియా జకార్తాలో భారీ అగ్నిప్రమాదం | Jakarta building fire Accident

ఒక సందర్భంలో విద్యార్థినికి డబ్బులు అవసరం కావడంతో ఆమె సాయికుమార్‌ను సంప్రదించింది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసిన అతడు తన గదికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. విషయం ఎవరైనా చెబితే బెదిరింపులు చేసినట్లు కూడా తెలిపింది.

విద్యార్థిని ఈ విషయం తన స్నేహితురాలికి చెప్పగా, ఆమె సహకారంతో అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మైనర్‌ కావడంతో సాయికుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *