Delhi Air Pollution | ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్…4 వారాల్లో యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపడంతో సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య బారిన పడిన ఢిల్లీ ప్రజలకు ఊపిరి అందించేలా తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) చేసిన సూచనలను ఎలా అమలు చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు వచ్చే నాలుగు వారాల్లో పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను…
