తెలంగాణలో కురిసిన వర్షాల కారణంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ హౌజ్ లోకి వరద నీరు చేరింది. రూ. 10 కోట్లు నష్టం, అంచనా వేయడం కొనసాగుతోంది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వరద నష్టం

తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు వరద ముంచెత్తింది. అండర్ టన్నెల్ లోకి వరద నీరు చేరింది. వెంకటాద్రి పంప్ హౌజ్ నీట మునిగింది. కీలకమైన మెషిన్లలోకి నీరు చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా రూ.10 కోట్ల వరకు నష్టం ఏర్పడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వరద నీటిని బయటకు ఎత్తిపోస్తున్నామని వివరించారు. పంప్ హౌజ్ లో నుంచి నీటిని పూర్తిగా బయటకు పంపాకే నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేయొచ్చని తెలిపారు. రాష్ట్ర…

Read More
ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. ప్రతి రాష్ట్రానికి రూ. 50 లక్షలు.

ఎన్టీఆర్ వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం

భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాలు అత‌లాకుత‌లం అయ్యాయి. జన‌జీవనం అస్త‌వ్య‌స్తంగా మారింది. ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాలు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు ప్ర‌ముఖులు వ‌ర‌ద బాధితుల‌కు త‌మవంతు సాయం చేందుకు ముందుకు వ‌స్తున్నారు.  మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వనీద‌త్ విరాళాలు ప్ర‌క‌టించారు. తాజాగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల‌కు విరాళం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ‘ఎక్స్’…

Read More
తెలుగు రాష్ట్రాల్లో భయకంపితమైన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు మాలెగావ్‌లో దోపిడీ చేసింది. 70 గ్రాముల బంగారం, అరటిపండ్లతో పాటు ఇంటిలో చొరబడారు. సీసీటీవీలో రికార్డు.

చెడ్డీగ్యాంగ్ మాలెగావ్‌లో దొంగతనం

నిన్నమొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలను భయకంపితులను చేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు మహారాష్ట్రలో వాలింది. నాసిక్‌లోని మాలెగావ్‌లో ఓ ఇంటితోపాటు కాలేజీలోకి చొరబడిన దొంగలు  రూ. 5 లక్షల విలువైన 70 గ్రాముల బంగారంతోపాటు అరటిపండ్లను ఎత్తుకెళ్లారు. చెడ్డీ, బనియన్ ధరించిన దొంగలు ఆవరణలోకి ప్రవేశించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.  మాలెగావ్‌లో నిన్నమొన్నటి వరకు ‘గౌన్‌గ్యాంగ్’ హల్‌చల్ చేయగా, ఇప్పుడు చెడ్డీగ్యాంగ్ రంగంలోకి దిగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గౌన్‌గ్యాంగ్ సభ్యులు మహిళల గౌన్లు ధరించి…

Read More
ఏపీలో భారీ వర్షాల వల్ల తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. స్వామివారి దర్శనం 6 గంటలలో పూర్తవుతుంది. సోమవారం 63,936 మంది భక్తులు దర్శించుకొని రూ.4.55 కోట్లు హుండీ ఆదాయం.

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది

ఏపీలో భారీ వ‌ర్షాల కార‌ణంగా తిరుమ‌ల‌కు భ‌క్తుల ర‌ద్దీ భారీగా త‌గ్గిపోయింది. గ‌త రెండుమూడు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ర‌వాణా వ్య‌వ‌స్థకు అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో భ‌క్తుల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. దీంతో మునుప‌టి మాదిరి స్వామివారి ద‌ర్శ‌నానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌డం లేదు. కేవ‌లం 6 గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం పూర్తవుతోంది.  ఉచిత సర్వదర్శనం కోసం భ‌క్తులు ఐదు కంపార్టుమెంట్లలో మాత్ర‌మే వేచి ఉన్నారు. అటు టైమ్‌ స్లాట్‌ (ఎస్‌ఎస్‌డీ) ద‌ర్శ‌నం కోసం మూడు…

Read More

వరద బాధితులకు ఆహారం… సీఎం చంద్రబాబు ఆదేశాలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతీ ఒక్కరికీ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు మంగళవారం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. సహాయక విధుల్లో నిమగ్నమైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన ఆహార పంపిణీ వివరాలపై అధికారులను ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాఫ్టర్లతో ఆహార…

Read More