ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేసిన రేవంత్

CM Revanth warns party MLAs against indiscipline, says no leniency if party line is crossed during CLP meeting. CM Revanth warns party MLAs against indiscipline, says no leniency if party line is crossed during CLP meeting.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన తమ సొంత ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ గీత దాటి ప్రవర్తించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, అలాంటి వారి తీరును సరిచేయాల్సిందేనని తెలిపారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్టీకి హాని కలిగించాలన్న ఆలోచన చేసే ఎవరైనా చివరికి స్వయంగా నష్టపోతారన్నారు. పార్టీలోకి వచ్చి పదవులు ఆశించటమే కాకుండా, పార్టీ పరిపాలనకు అడ్డంగా మారడాన్ని భరించేది లేదన్నారు. మంత్రి వర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే తుదిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు మాట్లాడటం ప్రయోజనం లేదని చురకలు అంటించారు.

ముందు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. తాను మే 1 నుంచి ప్రజల్లోకి వెళతానని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న విమర్శలకు తాము జవాబివ్వాలంటే, ప్రజల్లోకి వెళ్లి పనులు చేసి చూపించాల్సిందేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనపై కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిడులు, విమర్శలు రాజకీయ వ్యూహమని అన్నారు.

తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల వల్లే ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగినట్టు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోందని అన్నారు. త్వరలోనే రాష్ట్రానికి మరిన్ని కేంద్ర సహాయాలు రావాలని కోరారు. పద్ధతిగా వ్యవహరించని నాయకులకు పార్టీ శిక్ష తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *