Pulwama Attack 2019: ఫిబ్రవరి 14, 2019… భారత చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని దుఃఖదినం. ఈ రోజు జమ్మూ కశ్మీర్లోని పుల్వామా వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడిలో దేశం 40 మంది ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయింది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున CRPF కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
2019 ఫిబ్రవరి 14 సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో జమ్ము–శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పుర (అవంతిపురా సమీపంలో) ఈ దారుణం చోటుచేసుకుంది. పేలుడు పదార్థాలతో నిండిన కారు బస్సును ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించి 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడికి పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ Jaish-e-Mohammed బాధ్యత వహించింది.
ఈ ఘటన దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు ఏకతాటిపైకి వచ్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14ను భారత్లో ‘బ్లాక్ డే’గా పాటిస్తూ, పుల్వామా వీరులకు పుష్పాంజలి ఘటిస్తున్నారు.
పుల్వామా దాడి అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. 2019 ఫిబ్రవరి 26న Indian Air Force పాకిస్థాన్లోని బాలాకోట్ ప్రాంతంలో వైమానిక దాడులు నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అనంతరం జరిగిన పరిణామాల్లో మిగ్-21 విమానం కూలిపోగా, పైలట్ Abhinandan Varthaman పాకిస్థాన్ చెరలో చిక్కారు. అంతర్జాతీయ ఒత్తిడితో మార్చి 1న ఆయన విడుదలయ్యారు.
ఈ దాడి అనంతరం పాకిస్థాన్తో వాణిజ్య సంబంధాలు రద్దు చేయడం, ఎఫ్ఏటీఎఫ్ వద్ద కఠిన చర్యలు కోరడం వంటి నిర్ణయాలతో భారత్ తన దృఢ సంకల్పాన్ని చాటింది.
Pulwama Attack 2019 | వీరమరణం పొందిన జవాన్లకు పుష్పాంజలి
pulwama-attack-2019-black-day-india
