నాగార్జున సాగర్–శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకాభివృద్ధి దృష్ట్యా తిరిగి ప్రారంభిస్తున్న ఈ సేవలకు కొత్త టికెట్ రేట్లు కూడా విడుదలయ్యాయి.
పెద్దలకు వన్వే ప్రయాణానికి రూ.2,000, రెండు వైపులా ప్రయాణానికి రూ.3,250గా అధికారులు నిర్ణయించారు. చిన్న పిల్లలకు (వయసు 5 నుంచి 10) వన్వే ప్రయాణం రూ.1,600, రెండు వైపులా ప్రయాణం రూ.2,600గా టికెట్ ధరలు ఖరారు చేశారు.
ALSO READ:RGV on Rajamouli Controversy | వివాదంపై ఆర్జీవీ ట్వీట్…దేవుణ్ని నమ్మకపోవడం కూడా హక్కే
పర్యాటకులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని, బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్లో సదుపాయం అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
టికెట్ బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.సాగర్–శ్రీశైలం మార్గంలో లాంచ్ ప్రయాణం పర్యాటకులకు విశేష అనుభూతిని అందిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
