Monday, July 6, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshNagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం

Nagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం

-

Chat on WhatsApp

నాగార్జున సాగర్–శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకాభివృద్ధి దృష్ట్యా తిరిగి ప్రారంభిస్తున్న ఈ సేవలకు కొత్త టికెట్ రేట్లు కూడా విడుదలయ్యాయి.

పెద్దలకు వన్‌వే ప్రయాణానికి రూ.2,000, రెండు వైపులా ప్రయాణానికి రూ.3,250గా అధికారులు నిర్ణయించారు. చిన్న పిల్లలకు (వయసు 5 నుంచి 10) వన్‌వే ప్రయాణం రూ.1,600, రెండు వైపులా ప్రయాణం రూ.2,600గా టికెట్ ధరలు ఖరారు చేశారు.

ALSO READ:RGV on Rajamouli Controversy | వివాదంపై ఆర్జీవీ ట్వీట్…దేవుణ్ని నమ్మకపోవడం కూడా హక్కే

పర్యాటకులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని, బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్‌లో సదుపాయం అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

టికెట్ బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.సాగర్–శ్రీశైలం మార్గంలో లాంచ్ ప్రయాణం పర్యాటకులకు విశేష అనుభూతిని అందిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp