Monday, April 13, 2026
Chat on WhatsApp
HomeTelanganaAdilabadతెలంగాణ వంటకాల ఆనంద మేళాలో ఎంపీలు, నేతల హాజరు

తెలంగాణ వంటకాల ఆనంద మేళాలో ఎంపీలు, నేతల హాజరు

-

Chat on WhatsApp

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ వంటకాల ఆనంద మేళా కార్యక్రమంలో, విద్యార్థులు తెలంగాణ వంటకాల రుచి చూసి ఆనందించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల కొరకు కంప్యూటర్లను మరియు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి విద్యా రంగంలో చేసిన మార్పులపై కృతజ్ఞతలు తెలుపుతూ జరిగింది.

ఈ కార్యక్రమంలో, మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, మాజీ సర్పంచులు సాకె ఆనంద్, పురుషోత్తం, ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి మేడం, రిటైర్డ్ గ్రామీణ బ్యాంక్ అధికారి చిన్నయ్య, గ్రామ పెద్దలు చిలుకూరు వెంకటరెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, కృత్యార్ధంగా గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు కలసి వంటకాలను రుచి చూసి, తెలంగాణ వంటకాలకు అనుబంధంగా చర్చలు సాగించారు. ముఖ్యమైన అనుభవాలను పంచుకున్నారు మరియు ఈ కార్యక్రమం పాఠశాల విద్యార్థులకు పెద్ద ఉత్సాహాన్ని కలిగించింది.

ప్రారంభ దశలో గ్రామస్థులు, ఉపాధ్యాయులు, మాజీ కో ఆప్షన్ మెంబర్ బాబు ఖాన్, దేవిదాస్, సంతోష్, రావుల నారాయణ, రాకేష్ తదితరులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp