Karnataka IAS Officer Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతేశ్ బిళగి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న మహంతేశ్ బిళగి ఒక వేడుకకు హాజరయ్యేందుకు ప్రయాణిస్తుండగా, కలబురగి జిల్లా గౌనహళ్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఢీకొట్టిన తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహంతేశ్ బిళగితో పాటు కారులో ఉన్న ఇద్దరు బంధువులు కూడా అక్కడికక్కడే మరణించారు.
ALSO READ:Women Safety Helpline: దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం కొత్త సేవ ప్రారంభం ప్రారంభం
ఘటన వివరాలు వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అధికారులు మరియు రాజకీయ నేతలు స్పందించారు. ఒకే ప్రమాదంలో ఐఏఎస్ అధికారి సహా ముగ్గురు మరణించడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మహంతేశ్ బిళగి కుటుంబానికి సంతాపం తెలిపారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదం రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో కూడా షాక్కు గురిచేసింది.
