జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని బీచుపల్లి పవిత్ర పుణ్యక్షేత్రం లో గ్రామపంచాయతీ టోల్గేట్ టెండర్ వేయడం జరిగింది అటెండర్ వేలంపాట దక్కించుకున్న గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని 20 రూపాయలు 30 రూపాయలు టోల్ వసూలు చేయాల్సి ఉండగా 50 రూపాయలు ప్రతి వాహనానికి వసూలు చేస్తున్నారు అదేంటి అనే నేను నిలతీయగా వారు డొంకతిరుగుడు సమాధానం చెప్పడం జరుగుతుంది. వెంటనే పంచాయతీ సెక్రెటరీ నీ సంప్రదించగా బుక్కులు వారిచ్చిన రసీదు చూపించగా మేము ఈ ముద్ర వేయలేదు వారు సొంతంగా ఫోర్జరీ చేసి ముద్ర వేసుకున్నారు.
ఇది మా గ్రామపంచాయతీ ముద్ర కాదు అని తెలియజేశారు. మేము విచారణ జరిపి వారి పైన చర్య తీసుకుంటాము అన్నారు బాధితులు అడిషనల్ కలెక్టర్ తో సంప్రదించగా విచారణ పూర్తి అయ్యేవరకు పార్కింగ్ వసూలు చేయకూడదని తెలియజేశారు. బాధితులు తిమ్మాపురంనారాయణ నాయుడు పవిత్ర పుణ్యక్షేత్రం దగ్గర అక్రమాలకు పాల్పడితే ఎటువంటి వారినైనా సహించకండి అని గూటుగా సమాధానం చెప్పారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు ఉపేందర్, రవి, బీచుపల్లి రఘు, బీచుపల్లి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.