Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshపెదనందిపాడు సెంటర్లో సిపిఎం ట్రూ ఆఫ్ చార్జీలకు వ్యతిరేక నిరసన

పెదనందిపాడు సెంటర్లో సిపిఎం ట్రూ ఆఫ్ చార్జీలకు వ్యతిరేక నిరసన

-

Chat on WhatsApp

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్‌లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు కరెంటు బిల్లుల ప్రతులను సూపించి వాటిని దగ్ధం చేశారు.

సిపిఎం నాయకులు దోప్పలపూడి రమేష్ బాబు, సుక్క యానాదులు, కొత్త వెంకట శివ నాగేశ్వరరావు సహా 10 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వమంటే పేదలకు అండగా ఉంటుందని చెప్పిన కూటమి ఇప్పుడు అదనపు చార్జీల భారం మోపుతోందని విమర్శించారు.

సిపిఎం నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కూటమి స్మార్ట్ మీటర్లను తీసేస్తామని చెప్పి ఇప్పుడు 11,500 కోట్ల అదనపు భారం మోపుతోందని పేర్కొన్నారు. వచ్చే నెల నుండి మరో 6000 కోట్ల భారం విధించబోతున్నారని తెలిపారు. దీనివలన కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సిపిఎం నాయకులు వెంటనే ట్రూ ఆఫ్ చార్జీలను రద్దు చేయాలని, స్పాట్ మీటర్లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం స్థానిక ప్రజల దృష్టిని ఆకర్షించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp