Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని(Air Pollution) ఎదుర్కొనేందుకు భారత్కు సహకారం అందించేందుకు చైనా సిద్ధంగా ఉందని ప్రకటించింది. గతంలో చైనా కూడా తీవ్రమైన గాలి కాలుష్య సమస్యను ఎదుర్కొన్నప్పటికీ, కఠినమైన పర్యావరణ చర్యలతో పరిస్థితిని అదుపులోకి తెచ్చిందని పేర్కొంది.
ఈ అనుభవాలను భారత్తో పంచుకోవడానికి సిద్ధమని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ తెలిపారు.
ALSO READ:Amruta Fadnavis Contraversy | మెస్సీతో సెల్ఫీ వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య
ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో, చైనా గాలి కాలుష్యాన్ని దశలవారీగా ఎలా నియంత్రించిందన్న విషయాలపై త్వరలో ప్రత్యేక సిరీస్ను విడుదల చేస్తామని యు జింగ్ వెల్లడించారు.
ఇదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అధికారులు GRAP స్టేజ్-4 చర్యలను అమలు చేస్తున్నారు.
శీతాకాలంలో వాహనాల నుండి వెలువడే ఉద్గారాలు, నిర్మాణ కార్యకలాపాల వల్ల ఏర్పడే ధూళి, పరిశ్రమల కాలుష్యం, పంట అవశేషాల దహనం వంటి కారణాలు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
మరోవైపు బీజింగ్లో 2013 తర్వాత బొగ్గు వినియోగాన్ని భారీగా తగ్గించడం, పాత వాహనాలను రోడ్లపై నుంచి తొలగించడం, శుభ్రమైన శక్తి వనరులపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా గాలి నాణ్యతను గణనీయంగా మెరుగుపరచగలిగింది.
అయితే పాలనా విధానాలు, ప్రాంతీయ సమన్వయం, ఆర్థిక వనరుల కొరత వంటి కారణాలతో ఢిల్లీలో చైనా తరహా చర్యలు అమలు చేయడం సవాలుగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
