
మిర్యాలగూడలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. మిర్యాలగూడలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో 811 మంది, దామరచర్లలో 56 మంది, అడవి దేవులపల్లిలో 8 మంది, వేములపల్లిలో 45 మంది, మాడుగులపల్లిలో 32 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అధికారులు…