Khammam Collector Mujammil Khan walked 2 km in Tekulapalli, discussing irrigation issues with farmers.

టేకులపల్లి గ్రామంలో రైతులతో ఖమ్మం కలెక్టర్ ముచ్చట

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పర్యటించి, రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు. వ్యవసాయ పొలాల వెంబడి రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగు నీటి సమస్యలు, భూ సంబంధిత సమస్యలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాగు నీటి విడుదల షెడ్యూల్‌ను ఆయకట్టు రైతులకు ముందుగానే తెలియజేయాలని అధికారులకు సూచించారు. టెయిల్ ఎండ్ విధానాన్ని పాటిస్తూ ముందుగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు…

Read More
Khammam Collector Mujumul Khan visited a model school, taught social studies to 10th-grade students, and reviewed education standards.

ఉపాధ్యాయుడిగా మారిన ఖమ్మం కలెక్టర్ ముజుముల్ ఖాన్

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుముల్ ఖాన్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు ప్రత్యక్షంగా బోధించారు. కల్లూరు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. పాఠశాల సదుపాయాలను పూర్తిగా పరిశీలించి, విద్యార్థుల అవసరాలు, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. తర్వాత ఓ తరగతి గదిలో విద్య బోధన జరుగుతున్న తీరును పరిశీలించేందుకు 10వ తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు అనేది నేరుగా గమనించి, విద్యార్థులకు మరింత…

Read More
Residents of Kishtaram Ambedkar Colony in Khammam staged a relay hunger strike against coal dust pollution, detaining PO Narasimha Rao in protest.

శెయిలో బంకర్ కాలుష్యానికి నిరసన – పిఓను బంధించిన కాలనీ ప్రజలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ కాలనీ ప్రజలు బొగ్గునుసి కాలుష్యానికి వ్యతిరేకంగా గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కాలనీ ప్రజలు శెయిలో బంకర్ కారణంగా తీవ్ర కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, దీని వల్ల అనేకమంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. కాలనీ ప్రజలు దీనిపై స్పందించాలని, పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, కిష్టారం ఓసి పిఓ నరసింహారావు శైలో బంకర్ వైపు వెళ్లే సమయంలో, దీక్షా శిబిరంలో…

Read More
Residents protest against silo bunker pollution, demanding action and threatening to halt OC operations.

సింగరేణి కాలుష్యానికి నిరసనగా అంబేద్కర్ కాలనీ ఆందోళన

ఖమ్మం జిల్లా క్రిష్టారం అంబేద్కర్ కాలనీ ప్రజలు సైలో బంకర్ కాలుష్యం వల్ల ప్రాణాలు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య సమస్యను పరిశీలించేందుకు వచ్చిన ఓసి పిఓ నరసింహారావును స్థానికులు కమ్యూనిటీ హాల్లో బంధించి, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు సమస్యను నిర్లక్ష్యం చేస్తూ జనాలను ముంచుతున్నారని ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కాలనీ ప్రక్కనే నిర్మించిన సైలో బంకర్ వల్ల అధికంగా ధూళి వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు…

Read More
Students embarked on a jungle trek at Puligundala despite leopard warnings, gaining awareness about forest conservation from officials.

చిరుత భయాన్ని జయించిన విద్యార్థుల వనయాత్ర

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఈ భయాన్ని పట్టించుకోకుండా, ధైర్యంగా విద్యార్థులు పులిగుండాల ప్రాజెక్టుకు విహారయాత్రకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దర్శిని కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ప్రకృతి పరిచయం చేసేందుకు ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ వనయాత్రలో పెనుబల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫారెస్ట్ అధికారుల సహాయంతో అడవిలోని జీవవైవిధ్యాన్ని అనుభవించారు. తల్లాడ ఫారెస్ట్…

Read More
In Sattupalli’s Rajiv Nagar, a strong bond between a dog and a monkey is astonishing people, serving as a lesson in true friendship.

సత్తుపల్లిలో కుక్క-కోతి మిత్రత్వం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది

ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాజీవ్ నగర్ కాలనీలో రెండు మూగజీవాల మిత్రత్వం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక కుక్క, ఒక కోతి మధ్య ఏర్పడిన అనుబంధం అక్కడి ప్రజలను ఆనందానికి, ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కులాలు, మతాలు, దేవుళ్ల పేరుతో మనుషులు తగాదాలు పడుతూ ఉన్న ఈ సమాజంలో, వీటి మైత్రి అందరికీ గొప్ప గుణపాఠంగా మారుతోంది. కుక్క ఎక్కడికెళ్లినా కోతి దాని వీపుపై ఎక్కి వెళుతోంది. వేరు వేరు జాతులలో జన్మించినా, ఇవి విడిపోవడం అసాధ్యమయ్యింది. స్వార్థంతో మానవులు…

Read More
An ancient sword was discovered in a Tummuru farm. Villagers urge the government to conduct historical research as authorities remain unresponsive.

తుమ్మూరులో పురాతన కత్తి ఆవిష్కరణ గ్రామస్తుల ఆశ్చర్యం

ఒకప్పుడు రాజుల ఏలుబడిలో ఉన్న తుమ్మూరు గ్రామం నేడు చారిత్రక శేషాలను వెలికితీస్తోంది. అడపాదడపా రైతులు వ్యవసాయ పనులు చేస్తుండగా పురాతన వస్తువులు బయటపడుతున్నాయి. తాజాగా ఓ రైతు పొలం దున్నుతుండగా నాగలి కర్రకు పట్టి శిధిలావస్థలో ఉన్న పురాతన కత్తి వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అదే ప్రాంతంలో పంచలోహాల వీరభద్రుని విగ్రహాలు బయటపడ్డ ఘటనలు ఉన్నాయి. కళ్యాణ స్వామి ఆలయ పరిసరాల్లో కాకతీయుల కాలానికి చెందిన అనేక చారిత్రక నిర్మాణాలు, సొరంగ మార్గాలు కనబడుతున్నాయి….

Read More