Officials reviewed polling centers in Tenali ahead of the Krishna-Guntur Graduates’ MLC elections. Arrangements are in place for peaceful voting on the 27th.

తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, తహశీల్దార్ గోపాలకృష్ణ, త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. 27న జరగనున్న ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిరభ్యంతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారుల సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తెనాలి సబ్…

Read More
On Maha Shivaratri, devotees flocked to the Sangameshwara Swamy temple. Special rituals were performed, and the grand Rathotsavam is set for tomorrow.

సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

మహాశివరాత్రి సందర్భంగా తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారి దర్శనార్థం భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు…

Read More
A mason named Gopi died in Tenali after coming into contact with high-tension wires during construction work, causing deep sorrow.

తెనాలి లో హైటెన్షన్ వైర్లు తగిలి తాపీమేస్త్రి మృతి

తెనాలి రజకపేటలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చాకలి ఐలమ్మ పార్క్ ఎదురుగా భవన నిర్మాణ పనులు చేస్తుండగా, హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి గోపి (35) అనే తాపీమేస్త్రి మృతి చెందాడు. కొల్లిపర గ్రామానికి చెందిన గోపి భవన నిర్మాణ పనుల కోసం పరంజాలు కడుతుండగా, పరంజా కర్ర జారి విద్యుత్ తీగలకు తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 2 టౌన్ పోలీసులు…

Read More
Fruit Vendor Brutally Murdered in Tenali Chenchupeta

తెనాలి చెంచుపేటలో పండ్ల వ్యాపారి దారుణ హత్య

తెనాలి చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్ల వ్యాపారి రబ్బాని దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో పాండురంగపేటకు చెందిన గౌస్ బాజీ రబ్బానిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన రబ్బానిని స్థానికులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. హత్య జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రబ్బాని ఛాతిపై మూడు చోట్ల కత్తిపోట్లు…

Read More
Tenali Municipal Commissioner announces Swachhata Divas on every third Saturday, urging public participation for a cleaner town.

తెనాలిలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛతా దివాస్!

తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రకటించినట్లు, పట్టణంలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతా దివాస్ నిర్వహించనున్నారు. శుభ్రత పెంపునకు ప్రజలను చైతన్యం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో వివిధ ప్రాంతాల్లో శుభ్రపరిచే చర్యలు చేపడతారు. ఈ నెల 15వ తేదీన స్వచ్ఛతా దివాస్‌ను సోర్స్ రిసోర్సెస్ రోజుగా నిర్ణయించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది కరపత్రాలను ఆవిష్కరించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద వ్యర్థాల వేరు చేయడం,…

Read More
Special rituals and pujas were held at Tenali Rameshwaram Temple on Magha Pournami, with devotees receiving Theertha Prasadam.

తెనాలి రామేశ్వరస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి ఉత్సవం

తెనాలి గంగానమ్మపేటలోని రామేశ్వరస్వామి ఆలయం ఎంతో పురాతనమైనది. త్రేతాయుగంలో పరశురాముడు స్వయంగా ఈ ఆలయాన్ని ప్రతిష్టించారని శాసనాలు చెబుతున్నాయి. స్వామివారు పశ్చిమ ముఖంగా దర్శనం ఇస్తారు. బాణలింగంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో, స్వామి గౌరి శంకరాత్మక స్వరూపంలో గోధుమ వర్ణంతో భాసిస్తున్నారు. ఈ ఆలయంలోని ఉత్సవ మూర్తులను తెనాలి రామకృష్ణ కవి ప్రత్యేకంగా తయారు చేయించినట్టు తెలుస్తుంది. ఆలయంలో మరో విశేషం 8,9వ శతాబ్దాల నాటి జైనతీర్థం కరుడి విగ్రహం ఉండడం. ఇది పురాతన జైన…

Read More
Vemuru MLA Nakka Anand Babu held a strategy meeting with leaders for Tenali MLC candidate Alapati Rajendra Prasad's victory.

తెనాలి MLC గెలుపుపై వ్యూహరచన సమావేశం

తెనాలి తెలుగుదేశం పార్టీ MLC అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి విజయం కోసం వ్యూహరచన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వేమూరు MLA నక్కా ఆనందబాబు గారు అధ్యక్షత వహించారు. తెనాలి సుల్తానాబాద్‌లోని స్వర్ణ ఇన్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ పరిశీలకులు, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్ గారు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి క్రమబద్ధమైన కార్యాచరణను అమలు చేయాలని సూచించారు….

Read More