ASP Ramanamurthy inspected MLC election polling centers in Tenali and gave necessary instructions to officials.

తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ

జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి తెనాలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో…

Read More
MLA Burra Ramana Janeyulu expressed confidence that Alapati Raja will win the Pattipadu MLC elections with a huge majority.

పత్తిపాడులో ఆలపాటి రాజా విజయాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు ధీమా

కాకుమాను మండలంలో పత్తిపాడు నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బుర్ర రామాంజనేయులు పాల్గొన్నారు. ఆలపాటి రాజా ప్రజలకు సేవ చేసే నాయకుడని, ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పత్తిపాడు నియోజకవర్గంలో ఆలపాటి రాజాకు పట్టభద్రుల నుంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఎమ్మెల్యే రామాంజనేయులు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థులు, యువత భవిష్యత్తును నిర్లక్ష్యం చేసిన జగన్…

Read More
Officials reviewed polling centers in Tenali ahead of the Krishna-Guntur Graduates’ MLC elections. Arrangements are in place for peaceful voting on the 27th.

తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, తహశీల్దార్ గోపాలకృష్ణ, త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. 27న జరగనున్న ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిరభ్యంతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారుల సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తెనాలి సబ్…

Read More
On Maha Shivaratri, devotees flocked to the Sangameshwara Swamy temple. Special rituals were performed, and the grand Rathotsavam is set for tomorrow.

సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

మహాశివరాత్రి సందర్భంగా తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారి దర్శనార్థం భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు…

Read More
TDP, Jana Sena, and BJP leaders campaigned extensively for Alapati Rajendra Prasad in Prattipadu.

ప్రత్తిపాడులో కూటమి తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రచారం

ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తూ, ప్రజల నుంచి మద్దతు కోరారు. ప్రత్తిపాడు గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలు, మార్కెట్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కూటమి నేతలు మాట్లాడుతూ, ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయమే అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణం ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు కూటమి…

Read More
A mason named Gopi died in Tenali after coming into contact with high-tension wires during construction work, causing deep sorrow.

తెనాలి లో హైటెన్షన్ వైర్లు తగిలి తాపీమేస్త్రి మృతి

తెనాలి రజకపేటలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చాకలి ఐలమ్మ పార్క్ ఎదురుగా భవన నిర్మాణ పనులు చేస్తుండగా, హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి గోపి (35) అనే తాపీమేస్త్రి మృతి చెందాడు. కొల్లిపర గ్రామానికి చెందిన గోపి భవన నిర్మాణ పనుల కోసం పరంజాలు కడుతుండగా, పరంజా కర్ర జారి విద్యుత్ తీగలకు తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 2 టౌన్ పోలీసులు…

Read More
Fruit Vendor Brutally Murdered in Tenali Chenchupeta

తెనాలి చెంచుపేటలో పండ్ల వ్యాపారి దారుణ హత్య

తెనాలి చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్ల వ్యాపారి రబ్బాని దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో పాండురంగపేటకు చెందిన గౌస్ బాజీ రబ్బానిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన రబ్బానిని స్థానికులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. హత్య జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రబ్బాని ఛాతిపై మూడు చోట్ల కత్తిపోట్లు…

Read More