A man was attacked with a knife and robbed of ₹11,000 near Tenali Katevaram. The victim is undergoing treatment, and police are investigating.

తెనాలి కటేవరం వద్ద దారుణం.. ప్రయాణికుడిపై కత్తి దాడి!

తెనాలి మండలం కటేవరం గ్రామం వద్ద అర్ధరాత్రి దారుణం జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆటోలో ప్రయాణికుడి మాదిరిగా ఎక్కి, అశోక్ కుమార్ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. అతని వద్ద ఉన్న రూ. 11,000 నగదును లూటీ చేసి పరారయ్యాడు. ఈ దాడితో అశోక్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు డ్వాక్రా డబ్బులు కడదామని బయటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అతని గొంతు, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం…

Read More
Farmers’ Union submits petition to Tenali Sub-Collector, demanding compensation for turmeric farmers affected by the cold storage fire.

పసుపు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి – రైతు సంఘం డిమాండ్!

దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్‌లో గతేడాది జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే, ఇప్పటి వరకు వారికి ఎలాంటి నష్టపరిహారం అందించకపోవడం దారుణమని రైతు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసింహకు వినతిపత్రం అందజేశారు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, కోల్డ్ స్టోరేజ్ భాధితులకు న్యాయం చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు…

Read More
ASP Ramanamurthy inspected MLC election polling centers in Tenali and gave necessary instructions to officials.

తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ

జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి తెనాలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో…

Read More
MLA Burra Ramana Janeyulu expressed confidence that Alapati Raja will win the Pattipadu MLC elections with a huge majority.

పత్తిపాడులో ఆలపాటి రాజా విజయాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు ధీమా

కాకుమాను మండలంలో పత్తిపాడు నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బుర్ర రామాంజనేయులు పాల్గొన్నారు. ఆలపాటి రాజా ప్రజలకు సేవ చేసే నాయకుడని, ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పత్తిపాడు నియోజకవర్గంలో ఆలపాటి రాజాకు పట్టభద్రుల నుంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఎమ్మెల్యే రామాంజనేయులు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థులు, యువత భవిష్యత్తును నిర్లక్ష్యం చేసిన జగన్…

Read More
Officials reviewed polling centers in Tenali ahead of the Krishna-Guntur Graduates’ MLC elections. Arrangements are in place for peaceful voting on the 27th.

తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, తహశీల్దార్ గోపాలకృష్ణ, త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. 27న జరగనున్న ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిరభ్యంతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారుల సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తెనాలి సబ్…

Read More
On Maha Shivaratri, devotees flocked to the Sangameshwara Swamy temple. Special rituals were performed, and the grand Rathotsavam is set for tomorrow.

సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

మహాశివరాత్రి సందర్భంగా తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారి దర్శనార్థం భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు…

Read More
TDP, Jana Sena, and BJP leaders campaigned extensively for Alapati Rajendra Prasad in Prattipadu.

ప్రత్తిపాడులో కూటమి తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రచారం

ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తూ, ప్రజల నుంచి మద్దతు కోరారు. ప్రత్తిపాడు గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలు, మార్కెట్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కూటమి నేతలు మాట్లాడుతూ, ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయమే అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణం ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు కూటమి…

Read More