నర్సీపట్నం సాయిబాబా ఆలయంలో లక్ష దీపారాధన వేడుక
భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సీపట్నం శ్రీ షిరిడిసాయి ఆలయంలో 23వ లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఆలయాన్ని సందర్శించారు. వీరిని ఆలయ కమిటీ వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు భక్తులకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు….
