Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeANAKAPALLIAnakapalleఅగ్ని ప్రమాద బాధితులకు జనసేన నేత సాయం

అగ్ని ప్రమాద బాధితులకు జనసేన నేత సాయం

-

Chat on WhatsApp

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన నిండుగొండ వెంకన్న ఇంటి అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ బాధిత కుటుంబానికి అండగా నిలిచింది.

మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రోత్సాహం కల్పించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు.

ఈ సందర్భంగా రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ, ఇల్లు కాలి నిరాశ్రయులైన కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం కాలిపోయిన ఇంటిని పరిశీలించిన సూర్యచంద్ర, బాధిత కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు వెలగల వెంకటరమణ, నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp