A youth named Pavan was murdered near Garnikam on Sunday night. Police are investigating the motive behind the killing.

రావికమతం వద్ద యువకుడి హత్య, విచారణలో పోలీసులు

విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం గర్ణికం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. మేడివాడకు చెందిన 22ఏళ్ల కొలిపాక పవన్ కుమార్ అఘాయిత్యానికి గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అనకాపల్లి నుంచి క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు….

Read More
A farmer set fire to his sugarcane crop due to delayed payments and low prices, suffering a loss of 20 tons and ₹60,000.

గిట్టుబాటు ధర రాక రైతు ఆవేదన – చెరుకు తోటకు నిప్పు

ఆరుగాలం కష్టపడి చెరుకు పండించినా గిట్టుబాటు ధర రాక, సకాలంలో చెల్లింపులు అందక రైతు తీవ్ర మనోవేదన చెందాడు. రొంగలి వెంకటరావు అనే రైతు తన 20 టన్నుల చెరుకు తోటకు నిరాశతో నిప్పంటించాడు. ప్రతి సంవత్సరం 60 టన్నుల చెరుకు చోడవరం చక్కెర కర్మాగారానికి సరఫరా చేస్తుంటానని, అయితే ఫ్యాక్టరీ పేమెంట్లు ఆలస్యం చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. చెరుకు పండించిన రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం నష్టాన్ని మిగిలిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట…

Read More
A woman was brutally murdered in Anakapalli, her body dismembered and dumped by the roadside, causing shock and panic.

అనకాపల్లి జిల్లాలో దారుణ హత్య – దుండగుల పాశవికత్వం

అనకాపల్లి జిల్లా, కశింకోట మండలం బయ్యవరంలో జరిగిన ఘోర హత్య కలకలం రేపుతోంది. గుర్తు తెలియని ఓ మహిళను దుండగులు నరికి హత్యచేసి, ఆమె శరీరాన్ని నడుము నుంచి కింద భాగాన్ని వేరు చేసి దుపట్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశారు. ఈ అమానుష ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలన చేపట్టారు. దుపట్లో ఒక చేయి, కాళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. హత్యకు గురైన మహిళ వయసు…

Read More
Ex-MLA Petla Umashankar Ganesh criticizes Speaker’s remarks on Nookambika Temple tenders.

స్పీకర్ వ్యాఖ్యలు విడ్డూరం – పెట్ల ఉమాశంకర్ గణేష్

స్పీకర్ పదవి ఎవరికి గొప్పని మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నూకాంబిక అమ్మవారి ఆలయానికి సంబంధించి స్పీకర్ చేసిన వ్యాఖ్యలు అసత్యమని తెలిపారు. ఆలయం నిర్మాణం గురించి తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతాయుతమైన పదవికి తగదని అన్నారు. గత మంగళవారం ఆలయం గురించి మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు గౌరవ స్పీకర్ అయ్యన్న అని సంబోధించడంతో, ఒక టిడిపి కౌన్సిలర్ చేత తనపై విమర్శలు చేయించడం సరికాదని పెట్ల…

Read More
10th class exams start today with strict security and Section 144 in place. Measures taken to ensure a smooth examination process.

నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచుతూ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులు పరీక్షలకు నిరభ్యంతరంగా హాజరయ్యేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు, ఎలాంటి…

Read More
A massive Jana Sena rally with 2000+ bikes, led by MLA Vijay Kumar Brothers, headed to the Pithapuram meeting.

అచ్చుతాపురం నుండి పిఠాపురం వరకు జనసేన భారీ ర్యాలీ

అచ్చుతాపురం మండలం నాలుగు రోడ్లు జంక్షన్ నుంచి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు భారీ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు 2000కి పైగా బైకులతో పిఠాపురం సభకు తరలివెళ్లారు. ఈ ర్యాలీ జనసైనికుల్లో ఉత్సాహాన్ని పెంచింది. బైక్ ర్యాలీ సాగుతున్నంతకాలం కార్యకర్తలు పార్టీ నినాదాలు చేస్తూ, పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని గౌరవిస్తూ ముందుకు సాగారు. ఈ ర్యాలీ జనసేనకు ఉన్న ప్రజాభిమానాన్ని…

Read More
Tribal farmers protested, demanding ₹200 per kg for cashew and government procurement through RBKs.

జీడిపిక్కలకు మద్దతు ధర ఇవ్వాలని గిరిజన రైతుల ఆందోళన

జీడిపిక్కలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మద్దతు ధరను నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. వెంకన్న తెలిపారు. గురువారం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గర్సింగి పంచాయతీకి చెందిన గిరిజన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం…

Read More