Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeANAKAPALLIAnakapalleరావికమతం వద్ద యువకుడి హత్య, విచారణలో పోలీసులు

రావికమతం వద్ద యువకుడి హత్య, విచారణలో పోలీసులు

-

Chat on WhatsApp

విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం గర్ణికం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. మేడివాడకు చెందిన 22ఏళ్ల కొలిపాక పవన్ కుమార్ అఘాయిత్యానికి గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అనకాపల్లి నుంచి క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం హత్యకు గల కారణాలు తెలుసుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పవన్‌ తండ్రి త్రిమూర్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం పవన్ ఫోన్ కొనడానికి రావికమతానికి వచ్చాడని చెప్పారు. అయితే అతనిపై ఎవరు, ఎందుకు దాడికి పాల్పడ్డారు అనే అంశాలు ఇంకా తెలియరాలేదు. పోలీసుల విచారణ అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, పవన్ హత్యపై గ్రామస్థులలో భయాందోళనలు నెలకొన్నాయి. మృతుడికి శత్రువులేమైనా ఉన్నారా? గతంలో ఏవైనా మనోభేదాలున్నాయా? అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

krishna mohan appointed interim general secretary of ayodhya ram mandir trust

అయోధ్య రామ మందిర ట్రస్ట్‌లో కీలక మార్పు.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎవరంటే ?

Ayodhya Ram Mandir Trust: రామ మందిర విరాళాల లెక్కలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక బాధ్యతల్లో మార్పులు చేపట్టింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్...
- Advertisement -
Chat on WhatsApp