గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్-బిజెపి కుమ్మక్కు?

BRS not fielding a candidate in Graduate MLC polls hints at a BJP alliance? Congress leader Anchanuri Rajesh makes bold claims. BRS not fielding a candidate in Graduate MLC polls hints at a BJP alliance? Congress leader Anchanuri Rajesh makes bold claims.

కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేత, మాజీ టెలికాం బోర్డు సభ్యుడు అంచనూరి రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అభ్యర్థిని నిలబెట్టకపోవడం బీజేపీతో కుమ్మక్కు తేలుస్తుందని అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ చిన్నచూపు రాజకీయాలు ఆడుతోందని, కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేకే బీజేపీతో గుప్పెట్లోకి వెళ్లిందని రాజేష్ విమర్శించారు. విద్యావంతులంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని, మూడున్నరేళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఆశిస్తున్నదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్, బీజేపీ నాటకాలు ప్రజలు గమనిస్తున్నారని, రేపటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారీగా ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ విజయం అవసరమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని, గ్రాడ్యుయేట్ టీచర్లకు కాంగ్రెస్ే భరోసా అని పార్టీ నేతలు తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ పొత్తును అర్థం చేసుకుని కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *