Tuesday, March 24, 2026
Chat on WhatsApp
HomeBhadradriAswaraopeta(ST)ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ - 9 బైకులు స్వాధీనం

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ – 9 బైకులు స్వాధీనం

-

Chat on WhatsApp

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుండి దొంగిలించిన 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. భద్రాచలం రోడ్‌లో వాహన తనిఖీల సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది.

సీఐ కరుణాకర్ వివరాల ప్రకారం, ఎస్సై యాయాతి రాజు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా, సరిపల్లి నరసింహారావు అనే వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతడు 9 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు తేలింది.

నరసింహారావు వివిధ ప్రాంతాల్లో నుండి వాహనాలను దొంగిలించి, వాటిని మళ్లీ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగతనాల ద్వారా పొందిన వాహనాలను రికవరీ చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు.

ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సంతోష్ సహా ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నరసింహారావుని కోర్టు ముందు హాజరుపరచడం జరిగిందని సీఐ కరుణాకర్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

పసిడిపై పశ్చిమాసియా యుద్ధ సెగ..

బిజినెస్ డెస్క్: ఈ ఏడాది ఆరంభంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు క్రమంగా దిగొస్తూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి....
- Advertisement -
Chat on WhatsApp