Saturday, April 11, 2026
Chat on WhatsApp
HomeCrime Newsకోక్రాఝర్ పార్క్‌లో చిరుతను చంపి స్మగ్లింగ్‌కు యత్నం

కోక్రాఝర్ పార్క్‌లో చిరుతను చంపి స్మగ్లింగ్‌కు యత్నం

-

Chat on WhatsApp

అస్సాంలోని కోక్రాఝర్ రాయ్ మోనా నేషనల్ పార్క్‌లో చిరుతను చంపి దాని చర్మాన్ని వలిచిన ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనలో అటవీశాఖ అధికారులు, సహస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) సిబ్బంది కలిసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి చిరుత చర్మం, 5 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వేటగాళ్లు చిరుతలు, ఏనుగులు, దుప్పిలు వంటి అడవి జంతువులను చంపి వారి శరీర భాగాలను చుట్టుపక్కల దేశాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీరి గత నేరచరిత్రపై కూడా వివరాలు సేకరించుతున్నారు.

రాయ్ మోనా నేషనల్ పార్క్ అడవి జంతువుల సంరక్షణకు ప్రాచుర్యం పొందింది. ప్రత్యేకంగా క్లౌడెడ్ లెపార్డ్, బెంగాల్ టైగర్, మచ్చల జింకలతో పాటు ఆసియా ఏనుగులకు ఇది ప్రధాన నివాసంగా ఉంది. ఈ ఘటనతో అటవీ సంరక్షణపై మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరం ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ రకమైన వేటగాళ్లను నిరోధించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అటవీశాఖ మరింత మేధోమథనం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు. జంతు సంరక్షణ కోసం ప్రజలు, అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp