Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakపాలాట అడవిలో ఎర్ర మట్టి అక్రమ తవ్వకం, రవాణా వివాదం

పాలాట అడవిలో ఎర్ర మట్టి అక్రమ తవ్వకం, రవాణా వివాదం

-

Chat on WhatsApp

మనోహరాబాద్ మండలం పాలాట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎర్ర మట్టి అక్రమ తవ్వకం జరుగుతోంది. జేసీబీ యంత్రాల సహాయంతో తవ్విన మట్టిని టిప్పర్ల ద్వారా రవాణా చేస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే జరుగుతున్న ఈ తవ్వకాలను అటవీ శాఖ అధికారులు చూస్తూ కూడా చర్యలు తీసుకోకపోవడం విమర్శల పాలవుతోంది.

స్థానికుల ఫిర్యాదుల ప్రకారం, ఈ తవ్వకాలు అటవీ ప్రదేశాన్ని హాని కలిగించే ప్రమాదం ఉందని, ఈ అంశంపై ఫారెస్ట్ అధికారులకు పలు మార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. ఎర్ర మట్టి అక్రమ రవాణా వల్ల గ్రామ పరిసర ప్రాంతాలకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ తవ్వకం వ్యవహారంపై ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యపు ధోరణి ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. తక్షణం ఈ తవ్వకాలను నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ప్రభుత్వ అధికారులను జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

ఈ తరహా అక్రమ తవ్వకాల వల్ల ప్రకృతి దెబ్బతింటుందని, భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు ఎదురవుతాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చర్యలను అరికట్టడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, పర్యావరణ పరిరక్షణకు దృష్టి సారించాలని వారు పిలుపునిచ్చారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp