Wednesday, April 15, 2026
Chat on WhatsApp
HomeInterNationalదక్షిణ కొరియాలో అత్యంత ఖరీదైన విడాకుల కేసు

దక్షిణ కొరియాలో అత్యంత ఖరీదైన విడాకుల కేసు

-

Chat on WhatsApp

దక్షిణ కొరియా ఎస్‌కే గ్రూప్ చైర్మన్ చే టే-వొన్ తన భార్య రోహ్ సోహ్-యోంగ్‌కు విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా దాదాపు రూ. 8,328 కోట్లు చెల్లించాలన్న తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2015లో మరో మహిళతో బిడ్డ జననం విషయం వెల్లడించడంతో దంపతుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. 2017లో రోహ్ విడాకుల కోసం కోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత కొన్ని సెటిల్‌మెంట్ చెల్లింపులు జరిగాయి.

రోహ్ సోహ్-యోంగ్ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్ టే-వూ కుమార్తె. ఎస్‌కే షేర్లలో 42.3 శాతం సహా దాదాపు రూ. 12,068 కోట్లు నగదుగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. షేర్లు కూడా విభజనలో భాగం కావాలని కోరారు. గత తీర్పులో రోహ్‌కు ఎస్‌కే షేర్లను కేటాయించాల్సిన అవసరమని కోర్టు పేర్కొంది, ఎందుకంటే రోహ్ ఎస్‌కే విలువ పెరగడంలో కీలక పాత్ర పోషించారని కోర్టు అభిప్రాయపడింది.

చే టే-వొన్ తన ఆస్తులను విడాకుల పరిష్కారాల నుంచి మినహాయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. భార్య తన ఆస్తులను తప్పుగా లెక్కకట్టినట్టు వాదిస్తూ, వారసత్వ ఆస్తులను విడాకుల పరిష్కారాల నుంచి మినహాయించాలని చే కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Stock market trading screen showing Sensex and Nifty gains after global geopolitical updates

Stock market | ఇరాన్–అమెరికా చర్చల ప్రభావం.. దూసుకెళ్లిన మార్కెట్లు

Stock market: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు...
- Advertisement -
Chat on WhatsApp