Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeInterNationalదక్షిణ కొరియాలో అత్యంత ఖరీదైన విడాకుల కేసు

దక్షిణ కొరియాలో అత్యంత ఖరీదైన విడాకుల కేసు

-

Chat on WhatsApp

దక్షిణ కొరియా ఎస్‌కే గ్రూప్ చైర్మన్ చే టే-వొన్ తన భార్య రోహ్ సోహ్-యోంగ్‌కు విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా దాదాపు రూ. 8,328 కోట్లు చెల్లించాలన్న తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2015లో మరో మహిళతో బిడ్డ జననం విషయం వెల్లడించడంతో దంపతుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. 2017లో రోహ్ విడాకుల కోసం కోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత కొన్ని సెటిల్‌మెంట్ చెల్లింపులు జరిగాయి.

రోహ్ సోహ్-యోంగ్ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్ టే-వూ కుమార్తె. ఎస్‌కే షేర్లలో 42.3 శాతం సహా దాదాపు రూ. 12,068 కోట్లు నగదుగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. షేర్లు కూడా విభజనలో భాగం కావాలని కోరారు. గత తీర్పులో రోహ్‌కు ఎస్‌కే షేర్లను కేటాయించాల్సిన అవసరమని కోర్టు పేర్కొంది, ఎందుకంటే రోహ్ ఎస్‌కే విలువ పెరగడంలో కీలక పాత్ర పోషించారని కోర్టు అభిప్రాయపడింది.

చే టే-వొన్ తన ఆస్తులను విడాకుల పరిష్కారాల నుంచి మినహాయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. భార్య తన ఆస్తులను తప్పుగా లెక్కకట్టినట్టు వాదిస్తూ, వారసత్వ ఆస్తులను విడాకుల పరిష్కారాల నుంచి మినహాయించాలని చే కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu | ఏపీ యువతకు గుడ్‌న్యూస్.. 10 వేల ఉద్యోగాలపై సీఎం చంద్రబాబు...

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి పూర్తిగా మారిందని, ఒకప్పుడు...
- Advertisement -
Chat on WhatsApp